BREAKING : సినీ గేయ రచయిత “కంది కొండ” ఆత్మహత్య…

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు.

ఇక తాజాగా టాలీవుడ్ సినీ గేయ రచయిత కందికొండ ఆత్మహత్య చేసుకున్నారు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ… ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. మోతీ నగర్ లోని సాయి శ్రీనివాస టవర్స్ లో రచయిత కందికొండ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఆయన ఉరి వేసుకుని చనిపోయినట్టు తెలిసింది. ఇక ఆయన ఆత్మహత్య పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు రాసిన కందికొండ.. సినీరంగంలో అడుగుపెట్టిన నాటి నుండి పన్నెండేళ్ళ సినీ ప్రస్థానంలో వేయికి పైగా పాటలు వ్రాసారు. తెలంగాణ నేపథ్యంలో ఎన్నో జానపద గీతాలు కూడా రచించారు. ఆయన బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా, గడపగడపనా, జనాల నోటన మార్మోగాయి.

ఆయన పాటలే కాదు కవిత్వం రాయటంలోనూ దిట్ట. తెలంగాణా యాసలో మనసుకు హత్తుకునేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత. మట్టిమనుషుల వెతలను, పల్లె బతుకు చిత్రాన్ని కథలుగా రచించి ఆయన కథకుడిగా కూడా విశేష ఆదరణ పొందారు. ఆయన మరణించడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక ఆయన మృతి విషయం తెలిసిన టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news