బండి సంజయ్ పెద్ద మాటలు మాట్లాడతారు.. కొంచెమైన సిగ్గు ఉండాలి : కల్వకుంట్ల కవిత

-

బండి సంజయ్ పెద్ద మాటలు మాట్లాడతారు..కొంచెమైన బీజేపీ నాయకులకు సిగ్గు ఉండాలని కల్వకుంట్ల కవిత ఫైర్‌ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో మనం రోడ్లపైకి తీసుకువచ్చిందని.. తెలంగాణ ప్రజలను రోడ్లపైకి తీసుకువచ్చిన ఘనత మోడీ సర్కార్ కు దక్కుతుందని నిప్పులు చెరిగారు. తెలంగాణ లో రైతులు ఆందోళనలో ఉన్నారని.. బిజెపి నేతలు అనేక మాటలు చెబుతున్నారు… ధాన్యం సేకరణ పై మాత్రం మాట్లాడ్డం లేదని మండి పడ్డారు.

తెలంగాణ ఉద్యమం తర్వాత ఇదే మొదటిసారి మళ్ళీ మనం రోడ్లు ఎక్కడం… జిడిపి పెంచమని అంటే …గ్యాస్ ,డీజిల్ ,పెట్రోల్ ధరలు కేంద్రం పెంచుతోందని ఆగ్రహించారు. బిజెపి ప్రభుత్వం కు సిగ్గు ఉండాలని.. గ్యాస్ సిలిండర్ 400 రూపాయాలకే ఇవ్వాలి …పెరిగిన భారం ను కేంద్రం భరించాలని డిమాండ్‌ చేశారు.

బండి సంజయ్ పెద్డ…పెద్ద మాటలు మాట్లాడతారు..వాళ్ళను…వీలను జైల్ ల పెట్టిస్తా అంటాడని ఆగ్రహించారు. దమ్ము ఉంటే కేంద్రం నుంచి సిలిండర్ పై తెలంగాణ కు సబ్సిడీ పై ప్రత్యేక ప్యాకేజి ఇప్పించు.. పేద ప్రజలకు మోడీ సర్కార్ ఏమి చేయలేదు…పెద్ద పెద్ద వాళ్లకు రుణమాఫీ చేసింది మోడీ సర్కార్ అని నిప్పులు చెరిగారు. అంబానీ …ఆధానిలకు …దేశం విడిచి వెళ్లిన విజయ్ మాల్యాకు మాత్రమే రుణమాఫీ జరిగిందని.. కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news