రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్..బర్తరఫ్ చేయాలి !

-

ప్రధాని నరేంద్ర మోడిపై ఆయన సర్కార్ పై నిప్పులు చెరిగారు తెలంగాణ రాష్ట్ర సిఎం కెసిఆర్. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాహుల్‌ గాంధీని ఉద్దేశించి నువ్వు ఎవరికి పుట్టావంటూ అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తప్పుబట్టారు సిఎం కేసీఆర్. ఆ మాటలు వింటే నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయి.. ఇదా మన సంప్రదాయమా ప్రధాని మోడీ, నడ్డా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు సిఎం కెసిఆర్.

అస్సాం సీఎంను పదవి నుంచి బర్తరఫ్‌ చేయాలని కోరారు సీఎం కేసీఆర్. భారత స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు రాహుల్‌ గాంధీ కుటుంబ సభ్యులు ప్రాణాలు ఇచ్చారని.. అలాంటి వారిని ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇదేనా హిందూత్వం అంటూ అగ్రహించారు.

బిజెపి పార్టీ రైతుల పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రైతుల మెడపై కత్తి పెట్టి… మోడీ సర్కార్ విద్యుత్ చట్టాలను తీసుకు వస్తుందని నిప్పులు చెరిగారు. రైతులను అవమానిస్తున్నారు.. గుర్రాలతో తొక్కిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news