తెలంగాణకు రావాలని..ముగ్గురు సీఎంలకు కిషన్ రెడ్డి లేఖ

-

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ చాలా దూకుడుగా ముందుకు వెళుతోంది. ఇప్పటికే మునుగోడుపై ఎలాగైనా గెలవాలని.. ప్లాన్‌ చేస్తున్న బీజేపీ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే..  తెలంగాణకు రావాలని..ముగ్గురు సీఎంలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

దీంతో పాటుగా ఏడాది పాటు హైదరాబాద్ విమోచన దినోత్సవాలను, నిజాం సంస్థానానికి సంబంధించిన ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ లో జరిగే కార్యక్రమంతోపాటుగా, ఏడాది పాటు జరిగే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరుతూ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఇక ఈ కార్యక్రమానికి అమిత్‌ షా కూడా హాజరుకానున్నారు. దీనికోసం బీజేపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news