రహదారులు తెరవాలంటూ… కిషన్ రెడ్డికి కేటీఆర్ ట్విట్..

-

ట్విట్టర్ వేదిగా అనేక మంది ప్రజల సమస్యలపై స్పందిస్తూ.. పరిష్కారం చూపిస్తుంటారు మంత్రి కేటీఆర్. మరోసారి ఇలాగే రహదారుల సమస్యపై స్పందించారు కేటీఆర్.  ఇటీవల కంటోన్మెంట్ ప్రాంతంలో 21 రహదారులను మూసి వేశారు. ఈ సమస్యపై ఇటీవల ఓ నెటిజెన్ కేటీఆర్ కు ట్విట్ చేయగా.. కిషన్ రెడ్డికి రీట్విట్ చేశారు కేటీఆర్. లక్షలాది మందికి ఉపయోగించే ఈ రహదారులను.. ప్రజల అవసరాన్ని ద్రుష్టిలో పెట్టుకుని ఓపెన్ చేయాలని కోరారు. 

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఇటీవల 21 రోడ్లను మూసేశారని ఓ వాహనదారుడు కేటీఆర్ కు ట్విట్ చేశారు. దీంతో స్పందించిన కేటీఆర్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రీట్విట్ చేశారు. అయితే కిషన్ రెడ్డి ఈరోడ్ల వివరాలు ఇవ్వాల్సిందిగా కోరారు. సమస్య పరిష్కారం కోసం కేటీఆర్ చొరవను హైదరాబాదీలు అభినందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news