కాంగ్రెస్ లో భ‌ట్టిది న‌డ‌వ‌ట్లేదు.. గ‌ట్టి అక్ర‌మార్కుల‌ది న‌డుస్తోంది : మంత్రి కేటీఆర్

-

కాంగ్రెస్ పార్టీ పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. భట్టి విక్రమార్క మంచోడని.. వాళ్ళ అధ్యక్షుడు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చాడు. కాంగ్రెస్ లో భట్టి ది నడవడం లేదు…గట్టి అక్రమార్కుడి ది నడుస్తుందని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే ల సపెన్షన్ చేస్తే… బీజేపీ అధ్యక్షుడు కంటే… కాంగ్రెస్ అధ్యక్షుడు ఎక్కువ బాధ పడ్డారని ఎద్దవా చేశారు. హుజూరాబాద్ లో కలిసి పని చేసినట్టు…. కలిసి పని చేస్తున్నారు అని ప్రచారమన్నారు.

తెలంగాణ పచ్చ బడుతుంటే… కొందరి కండ్లు ఎర్రబడుతున్నాయని అగ్రహించారు. సింగరేణి నీ కూడా అమ్మే కుట్ర చేస్తుందని కేంద్రం పై నిప్పులు చెరిగారు. ఛత్తీస్ ఘడ్ మినరల్ కంపెనీ కి అక్కడి గనులు అప్పగించినట్లు… తెలంగాణ కి సింగరేణి గనులు అప్పగించండి అని అడిగామన్నారు.

నిమ్స్ కోసం కేంద్రం ఇచ్చింది మూడు కోట్లు అని.. ఫార్మా సిటీ కి ఇచ్చింది ఐదేళ్లలో ఐదు కోట్లు ఇచ్చిందని చెప్పారు. కేంద్రం తెలంగాణ ను ఇంత చిన్నచూపు చూస్తుందని.. ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన పై ఎమ్మెల్యే లు కోచించ్ క్యాంప్ పెట్టండన్నారు. ట్రైనింగ్ కోసం టీ సాట్ పేరుతో ఇంటింటికీ కోచింగ్ ఇస్తున్నామని.. 35 లక్షల మంది వివర్స్ ఉన్నారని తెలిపారు. ఉద్యోగ ప్రకటన పై అనవసర మాటలు సరికాదు.. దురుద్దేశ మాటలు సరికాదు.. జాబ్ క్రియేటర్ అవుతా అనుకునే వాళ్లకు అవకాశాలు కూడా ఇస్తున్నామని పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news