వాహ్… వాటే స్కీమ్ అంటున్న కేటీఆర్… ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లిక్కర్ వ్యాఖ్యలపై సెటైర్..

-

సోము వీర్రాజు ఒక్క స్టేట్మెంట్ తో నెషనల్ వైడ్ గా పాపులర్  అయ్యారు. అధికారంలోకి వస్తే రూ. 75కే లిక్కర్ ఇస్తామంటూ నిన్న జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  కోటి మంది లిక్కర్ తాగుతున్నారు.. మాకు ఆ ఓట్లు వేయండి మీకు 75 రూపాయలకే లిక్కర్ ఇస్తాం… రెవెన్యూ బాగుంటే రూ. 50 కే ఇస్తామంటూ హామీ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిన్న మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలకే పరిచయం ఉన్న వీర్రాజు ఒకే నైట్ లో దేశం మొత్తానికి తెలిసేలా చేశాయి ఈ వ్యాఖలు. బీజేపీకి ప్రతిపక్ష పార్టీల నుంచి ట్రోలింగ్ మొదలైంది. 

తాజాగా సోము వీర్రాజు వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ’’ వాహ్.. వాటే స్కీమ్… అధికారం కోసం బీజేపీ పతనానికి దిగ జారింది. ఎంత అవమానకరం..చీప్ లిక్కర్‌ను రూ.50కి సరఫరా చేయాలనే బిజెపి జాతీయ విధానం లేదా ఎక్కడైతే అధికారంలో లేదే ఆ రాష్ట్రాలకే బంపర్ ఆఫరా..?‘‘ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news