బ్రేకింగ్ : హైద‌రాబాద్ లో మ‌హిళా న్యాయ‌వాది శివాని ఆత్మ‌హ‌త్య‌

-

హైద‌రాబాద్ మ‌హా నగ‌రంలో దారుణం చోటు చేసుకుంది. చందానగర్ లక్ష్మీ విహార్ ఫేజ్ వన్ డిఫెన్స్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ఈ కాలనీకి చెందిన శివాని అనే మహిళా న్యాయవాది ఆత్మహత్య చేసుకుంది. భర్త తో గొడవ కారణంగా లాయ‌ర్ శివానీ ఆత్మహత్య చేసుకున్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

ఈ సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే…. గత ఐదేళ్ల క్రితం అర్జున్ తో మహిళా న్యాయవాది శివానీ తో వివాహం జ‌రిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే.. గ‌త కొన్ని రోజుల నుంచి భార్య, భర్తల మధ్య వివాదాలు త‌లెత్తుతున్నాయి. ఇక ఈ వివాదాలు తార స్థాయికి చేర‌డం కారణంగా మహిళా న్యాయవాది శివాని…వారి భవనంపై నుండి దూకి రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఇక ఈ ఘ‌ట‌న జ‌రుగ‌డంతోనే… పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త అర్జున్. ఇక దీనిపై కేసు న‌మోదు చేసుకుని… ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version