విజయసాయి అధ్యక్షతన కీలక సమావేశం..పాల్గొన్న కేటీఆర్‌, తెలంగాణ నాయకులు

-

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో పార్లమెంట్ స్టాండింగ్ కమిటి సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ సమావేశం స్టాండింగ్ కమిటి ఛైర్మన్, వైసీపీ నేత, రాజసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ నేపథ్యలోనే… మెంబర్స్ ఆఫ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ కామర్స్ మెంబర్స్ అందరూ ఈ సమావేవేశానికి హాజరు అయ్యారు.

అలాగే,… కమిటి మెంబర్స్ తొమ్మిది మంది ఎంపీలు హాజరు కాలేకపోయారు. అటు తెలంగాణ రాష్ట్రం నుంచి ఐటి, కామర్స్ ఇండస్ట్రీస్ మంత్రి కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్, జయేష్ రంజన్, అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహచార్యులు హజరు అయ్యారు. అలాగే టీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, ఫిక్కి, డిక్కి.. ఎస్బీఐ, ఫార్మరంగ ప్రతినిధులు కూడా హాజరు అయ్యారు. ఇక ఈ సమావేశంలో.. రెండు తెలుగు రాష్ట్రాల అంశాలు, అభివృద్ధి పనులు, ఇతర కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version