విశాఖ ఆల్రెడీ రాజ‌ధాని అమ్మ మొగుడు లాంటి సిటీ.. వైసీపీని టార్గెట్ చేస్తూ నాగ‌బాటు ట్వీట్

-

ఏపీలో రాజధానులపై రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. విశాఖ గర్జన పేరిట వైసీపీ నేడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చి వెళుతున్న వైసీపీ కీల‌క నేత‌ల‌పై జ‌న‌సేన శ్రేణులు దాడికి పాల్ప‌డ‌టం, ఫ‌లితంగా న‌గ‌రంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న త‌రుణంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సోద‌రుడు, ఆ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుడు నాగ‌బాబు చేసిన ట్వీట్ వైర‌ల్‌గా మారింది.

konidela nagababu, Nagababu: నా జీవితం ఒక మిస్టరీ.. నేను సృష్టించబోయేది ఒక  హిస్టరీ: నాగబాబు - actor and janasena pac member konidela nagababu tweets  goes viral - Samayam Telugu

”విశాఖ‌ను మీరు రాజ‌ధాని చేయ‌డం ఏంట్రా బాబు. విశాఖ ఆల్రెడీ రాజ‌ధాని అమ్మ మొగుడు లాంటి సిటీ వీలైతే ఇండియాకు రెండో రాజ‌ధాని చేయ‌మ‌ని గ‌ర్జించండి” అని త‌న ట్వీట్‌లో నాగ‌బాబు పేర్కొన్నారు. అంతేకాకుండా ‘వైసీపీ ఇంజ్యూరియ‌స్ టూ ఏపీ ఎన్‌వైరాన్‌మెంట్‌’, ‘సేవ్ వైజాగ్ ఫ్రం ఎన్‌వైరాన్‌మెంట్ డెస్ట్రాయ‌ర్స్’ అనే హ్యాష్ ట్యాగుల‌ను కూడా ఆయ‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు. ఇదిలా ఉంటే.. చీకట్లోనే పవన్‌ కల్యాణ్‌ ర్యాలీ కొనసాగుతోంది. సెల్‌ ఫోన్ల వెలుతురులో పవన్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి జాతీయ రహదారిపైకి పవన్‌ కాన్వాయ్‌ ఉండటంతో.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news