వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన ఫోటోను షేర్ చేసిన నారా లోకేష్ !

-

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కీలక ఆధారాలు సీబీఐ అధికారులు చేతికి వచ్చాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కీలక నిందితుడని సిబిఐ అధికారులు ప్రాథమిక విచారణకు వచ్చే సమాచారం అందుతోంది. ఇలాంటి తరుణంలో నారా లోకేష్.. ఎంపీ అవినాష్ రెడ్డి, దేవినేని శివ శంకర్ రెడ్డి ఒకే బైక్ పై ఉన్న ఫోటోలు షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటో వైరల్ గా మారింది.

అంతే కాదు ఈ కేసు తప్పు దారు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ట్వీట్ చేశారు లోకేష్.
“వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి బంధువు, క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డికి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించే వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవ‌డంతో మ‌రిన్ని అనుమానాలు బ‌ల‌ప‌డుతున్నాయి.

ద‌స్త‌గిరి వాంగ్మూలం ప్ర‌కారం గొడ్డ‌లిపోటు సూత్ర‌ధారి వైఎస్ అవినాశ్‌రెడ్డి. అవినాశ్‌రెడ్డిని ఈ కేసునించి త‌ప్పించేందుకు సిట్ బృందాన్ని మార్చేసింది, సీబీఐ విచార‌ణ వ‌ద్ద‌న్న‌ది సిఎం జగన్. మీ బ్లూ మీడియాలో ఈ వైఎస్సాసుర ర‌క్త‌చ‌రిత్ర గురించి ఎప్పుడు రాయిస్తారో?” అంటూ సంచలన ట్వీట్ చేశారు నారా లోకేష్. దీంతో ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కయి.

Read more RELATED
Recommended to you

Latest news