పాకిస్తాన్ అజెండాను కాంగ్రెస్ అమలు చేస్తోంది : ప్రధాని మోడీ

-

పాకిస్తాన్ అజెండాను కాంగ్రెస్ అమలు చేస్తోందని భారత  ప్రధాని మోడీ పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. హర్యానా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. అలాగే మహారాష్ట్ర ప్రజలు కూడా పట్టం కడితే రాష్ట్రం అభివృద్ది చెందుతుందన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏకు అనుకూలంగా హవా కనిపిస్తోంది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని.. కాంగ్రెస్ పార్టీ పై మోడీ విమర్శలు చేశారు.

మహారాష్ట్ర ప్రజలు ఎన్డీఏ అభివృద్దిని నమ్ముతారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు గాంధీ కుటుంబానికి ఏటీఎంలు అన్నారు. రూ.వేల కోట్లు మహారాష్ట్రకు తరలిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై విమర్శలు చేసారు. కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని.. పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చేవిధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం చెందిదని తెలిపారు ప్రధాని మోడీ. 

Read more RELATED
Recommended to you

Exit mobile version