BREAKING : దేశంలోని సీఎంలు, ప్రతిపక్ష నాయకులకు మమత బెనర్జీ లేఖ

-

కోల్ కతా: దేశంలోని ముఖ్య మంత్రులు, ప్రతి పక్ష నాయకులకు వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ లేఖ రాశారు. ప్రజా స్వామ్యం పై భారతీయ జనతా పార్టీ ప్రత్యక్ష దాడులకు దిగుతోంది అంటూ ఆందోళన వ్యక్తం చేసిన వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ… బీజేపీకి వ్యతిరేకంగా కలిసి వచ్చే వాళ్ళందరితో సమావేశం కావాలని ఏ లేఖలో కోరారు.

అంతే కాదు బీజేపీ వ్యతిరేక సమావేశానికి అందరూ హాజరు కావాలని కోరారు సిఎం మమత. భారతీయ జనతా పార్టీని గద్దె దించేందుకు ప్రతి ఒక్కరూ ఒకటి కావాలని ఆమె పేర్కొన్నారు. అలాగైతేనే కేంద్రంలోని భారతీయ జనతా ప్రభుత్వాన్ని పడగొట్ట వచ్చని ఆమె తెలిపారు. దీని కోసం దేశంలోని ఎన్డీఏ యేతర పార్టీలన్నీ ఒకటి కావాలని స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి మమతా బెనర్జీ. ప్రతి పార్టీ దీనిపై స్పందించి.. ముందుకు రావాలని లేఖలో వెల్లడించారు మమతా బెనర్జీ..

Read more RELATED
Recommended to you

Latest news