ఇవాళ అధికారిక లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు

-

కొలాబాలోని రతన్‌ టాటా నివాసంలో పార్థివదేహం ఉంచారు. ఇవాళ ఉదయం 10.30 నుంచి రతన్‌ టాటాకు ప్రముఖులు నివాళులు అర్పిస్తారు.. మధ్యాహ్నం 3.30కి అధికారిక లాంఛనాలతో రతన్‌ టాటా అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఇప్పటికే మహారాష్ట్ర సర్కార్‌ అధికారిక ప్రకటన చేసింది.

కాగా కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న 86 ఏళ్ళ ర‌త‌న్ టాటా… ముంబ‌య్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతి చెందారు. గ‌తంలో టాటా స‌న్స్ గ్రూప్స్‌కి చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు ర‌త‌న్ టాటా. ఇక ర‌త‌న్ టాటా మ‌ర‌ణాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు ప్ర‌స్తుత టాటా స‌న్స్ గ్రూప్స్‌ చైర్మ‌న్ చంద్ర‌శేఖ‌ర‌న్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version