చంద్రబాబుకు వారసుడిగా రాజకీయ తెరపైకి ‘ఎన్టీఆర్’: వైవీ సుబ్బారెడ్డి

-

టీడీపీ అధినేత చంద్రబాబుకు వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయ తెరపైకి తీసుకొస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలుపుతున్నట్లు అనిపిస్తోందన్నారు. దానికి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి, ఎన్టీఆర్ భేటీయే నిదర్శనమన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీలో సరైన నాయకుడు లేడని, టీడీపీకి నాయకత్వం ఉందో లేదో తెలుసుకోవాలని ఆయన సూచించారు.

వైవీ సుబ్బారెడ్డి
వైవీ సుబ్బారెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం పూర్తిగా కోల్పోయారని పేర్కొన్నారు. అందుకే బీజేపీ నేత అమిత్ షా కూడా చంద్రబాబుతో భేటీ కాకుండా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారన్నారు. వైసీపీని నాశనం చేసేందుకు ఎన్ని కుట్రలు చేసినా అది సాధ్యం కాదన్నారు. ఆయా పార్టీలకు ఇష్టం లేకున్నంత మాత్రానా వైసీపీ అధికారంలోకి రాకుండా ఉండదన్నారు. జనం మద్దతులో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news