బస్సులో ఆక్సిజన్. కర్ణాటక ప్రభుత్వం వినూత్న ఆలోచన..

-

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు ఎంతగా పెరుగుతున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామందికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది. కావాల్సినన్ని ఆక్సిజన్ సిలిండర్లు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన వినూత్న ఆలోచన అందరికీ ఆసక్తిని కలిగిస్తుంది. ఆర్టీసీ బస్సులో ఆక్సిజన్ సిలిండర్లు, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి, కావాల్సిన వాళ్ళకి ఉచితంగా అందిస్తుంది. ఆక్సిజన్ కావాలనుకున్న వాళ్ళు ఈ బస్సుల్లోకి వెళ్తే సరిపోతుంది.

ఆర్టీసీ బస్సుల్లో కొన్ని సీట్లు తీసివేసి, రోగులకి మధ్య దూరం పెంచుతూ ఆక్సిజన్ సిలిండర్లని ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ కోసం ఆస్పత్రికి వెళ్ళే వారు ఇది వినియోగించుకోవచ్చు. ఆక్సిజన్ ఆన్ వీల్స్ అన్న పేరుతో ఈ నూతన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంటుంది. దేశంలో ఆక్సిజన్ సేవలు ఇంత వినూత్నంగా అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంతో ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుతం దాదాపుగా దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ఉంది. దాని కారణంగా కరోనా కేసులు కొద్ది కొద్దిగా తగ్గుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news