వరంగల్ కమిషనర్: పేపర్ కాపీయింగ్ కేసులో అసలు నిందితుడు జర్నలిస్ట్ ప్రశాంత్…

-

బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన తర్వాత వెలుగులోకి వచ్చిన విషయాలు ఏమిటంటే… పరీక్ష సెంటర్ నుండి పేపర్ ఒక ఫోటో రూపంలో బయటకు వచ్చింది. ఆ పేపర్ ఫోటోను ప్రశాంత్ అనే మాజీ జర్నలిస్ట్ తన ఫోన్ లో నుండి బండి సంజయ్ కు , ఈటల రాజేందర్ పి ఏ కు మరియు ఇంకా కొంతమందికి పంపాడని వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రంగనాధ్ ప్రెస్ మీట్ లో చెప్పారు. అంతే కాకుండా బండి సంజయ్ ను A1 గా చేశారని కూడా చెప్పాడు. ఇంతకీ ప్రశాంత్ గతమేమిటన్నది చూస్తే ఇతను జర్నలిస్ట్ గా పనిచేశాడట, అయితే ప్రస్తుతం మాత్రం ఏ మీడియా సంస్థలోనూ పని చేస్తున్నట్లు అధరాలు లేవని తెలుస్తోంది.

కాగా ఇప్పుడు ప్రశాంత్ పేపర్ ను లీక్ చేస్తే బండి సంజయ్ ను ఎందుకు A1 గా చేశారు .. ఒకవేళ ప్రశాంత్ కు కనుక బండి సంజయ్ ఇలా చేయమని చెప్పినట్లు తేలితే ఆ తర్వాత దానికి అర్ధం ఉంటుంది. మరి ఏమి జరిగింది ? విచారణలో ప్రశాంత్ ఈ విషయాన్ని చెప్పాడా ? అన్నది తెలియాలంటే మెజిస్ట్రేట్ దగ్గర విచారణ జరగాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version