పెద్దిరెడ్డి పొగరబోతు, ఆంబోతుగా తయారయ్యాడు : చంద్ర బాబు

-

చిత్తూరు జిల్లా నుంచి తాను, కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేశామని చంద్రబాబు గుర్తుచేశారు. పుంగనూరులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..”ప్రజాగళం” వేదికగా ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.

”మాతో నీకు పోలిక ఏంటి పాపాల పెద్దిరెడ్డి అని మండిపడ్డారు. పెద్దిరెడ్డి పొగరబోతు, ఆంబోతుగా తయారయ్యాడు. ఆయన రాజకీయ అహంకారానికి గండి పెట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు అని అన్నారు. నీకిక నిద్ర పట్టదు. నీ శివశక్తి డెయిరీకి తప్ప వేరే డెయిరీలకు పాలు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నావ్ అని విమర్శించారు. నా కార్యకర్తలను వేధింపులకు గురిచేశావ్… ఏది మరిచిపోలేదు, నువ్వు చేసిన అరాచకాలు.. నా నరనర్రాల్లో ఉన్నాయి అని చంద్ర బాబు ధ్వజమెత్తారు. జగన్ ఒక సైకో… ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాకా… బాదుడే బాదుడే” అని చంద్రబాబు సెటైర్లు వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version