BREAKING NEWS: సీఎం కేసీఆర్ కు జ్వరం… ప్రధానిని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి దూరం

-

మరికొద్ది సేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. అయితే ప్రధానిని రిసీవ్ చేసుకునే కార్యక్రమంలో కొద్ది పాటి మార్పలు చోటు చేసుకున్నాయి. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ దూరమయ్యారు. సీఎం కేసీఆర్ కు జ్వరం రావడంతో ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే సాయంత్రం ముచ్చింతల్ లోజరిగే కార్యక్రమానికి మాత్రం హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. ముందుగా ప్రధానికి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ కూడా వస్తున్నారని అనుకున్నప్పటికీ… సీఎంకి జ్వరం కారణంగా రావడం లేదని తెలుస్తోంది.

2.10 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆ తరువాత ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమానికి.. ఆ తరువాత ముచ్చింతల్ లోని సమతా మూర్తి విగ్రహ ఆవిష్కరణకు రానున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎస్, డీజీపీలు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news