మహేశ్ బాబు ‘పోకిరి’కి పదహారేళ్లు.. ఈ థియేటర్లలో సందడే సందడి..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పోకిరి’ విడుదలైన పదహారేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కృష్ణ- మహేశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫిల్మ్ లో హీరోయిన్ గా ఇలియానా నటించింది.

మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. ఈ పిక్చర్ విడుదలై ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది. ఇక ఈ చిత్రానికి పదహారేళ్లు సందర్భంగా సందర్భంగా మహేశ్ అభిమానుల కోసం థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తున్నారు. హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ లో ఆగస్టు 9న స్పెషల్ షో వేయనున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ వేస్తున్నారు. ఆయా థియేటర్లలో బుకింగ్స్ స్టార్టయినట్లు మహేశ్ అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. సప్తగిరి కాంప్లెక్స్ లోనూ స్పెషల్ షో వేయనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ‘పోకిరి’ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్లు అభిమానులు ట్వీట్ చేస్తున్నారు. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ పోకిరి మేనియా బిగిన్స్ …#PokiriManiaBegins తో వరుస ట్వీట్స్ చేస్తున్నారు. అలా సదరు హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

మహేశ్ బాబు ‘పోకిరి’లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘పండు’గానే కాక అండర్ కవర్ కాప్ గా ‘కృష్ణ మనోహర్ ఐపీఎస్’గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో మహేశ్ అదరగొట్టేశారు. పూరీ జగన్నాథ్ రాసిన డైలాగ్స్ ఈ పిక్చర్ కు హైలైట్ అని చెప్పొచ్చు. ఇకపోతే మహేశ్ ప్రజెంట్.. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళితో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news