టిడిపికి డిపాజిట్ కూడా ద‌క్క‌దు : అంబ‌టి

-

 Ambati Rambabu Sensational Comments on Chandrababu
విజయవాడ : రాజకీయ ఎత్తుగడ కోసమే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ రెండుగా చీల్చిందని, విభజనతో రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటలీ దెయ్యం సోనియాను తరిమికొట్టాలని, రాహుల్‌ గాంధీని పప్పు అని చంద్రబాబు అనలేదా అని అంబటి నిలదీశారు. అదే చంద్రబాబు ఇవాళ రాహుల్‌ను కలవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఆర్థిక సంబందాలే తప్ప మానవ సంబంధాలు లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు ఎప్పుడైనా ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేశారా? అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్‌ దక్కదని సర్వేలు చెబుతున్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news