బూతులతో కేసీఆర్ నీతులు…స్థాయి పెరుగుతుందా?

-

ఈ మధ్య తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బూతులు పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు విమర్శలు అంటే విమర్శలే ఉండేవి…ఇప్పుడు విమర్శలు అంటే బూతులే. పైగా బూతులు మాట్లాడుతున్నారని నేతలు అదే బూతులతో నీతులు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే పనిచేసినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ టార్గెట్‌గా కాంగ్రెస్, బీజేపీ నేతలు తీవ్ర పదజాలంతో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీల నేతలు కాస్త ఘాటైన పదజాలమే వాడుతున్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు.

kcr
kcr

అయితే అలా మాట్లాడుతున్న నాయకులపై చర్యలు తీసుకుంటామని అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షాలు బూతులు తిడుతున్నారని, అవి ఏ మాత్రం సహించే పరిస్తితి లేదని మంత్రి కేటీఆర్ ఆ మధ్యే చెప్పుకొచ్చారు. సరే ప్రతిపక్షాలు బూతులు మాట్లాడుతున్నాయి…అలా అని టీఆర్ఎస్ నేతలు ఏమి ప్రవచనాలు చెప్పడం లేదు…వారు దారుణంగానే మాట్లాడుతున్నారు. తాజాగా కేసీఆర్ కూడా అదే పని చేశారు.

తనపై బండి సంజయ్ చేసిన విమర్శలకు కౌంటర్లు ఇస్తూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఫాంహౌజ్‌లో కేసీఆర్ తాగి పడుకుంటున్నారని, ఆయన్ని జైలుకు పంపుతామని, ఫాంహౌజ్‌ని నాగళ్ళతో దున్నుతామని బండి మాట్లాడారు. దానికి కౌంటర్లు ఇస్తూ… .”నేను మందు తాగుతుండగా నువ్వు ఎప్పుడైనా చూశావా? నాకు ఎప్పుడైనా మందు కలిపి ఇచ్చావా? నా ఫాంహౌజ్‌ను దున్నుతామని అంటావ్‌. సంజయ్‌.. నువ్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌వా? రా నా ఫాంహౌజ్‌కి ఆరుముక్కలవుతావ్ నా కొడకా” అంటూ కేసీఆర్ బండిపై రెచ్చిపోయారు.

బ్రోకర్, జోకర్ అంటూ బండిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పైగా తనని తిడుతున్నారని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడకపోతే ఇబ్బందులు పడకతప్పదని హెచ్చరిస్తున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ మాట్లాడిన మాటలకు బాధ్యత ఎవరు తీసుకుంటారనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి..తనని తిడుతున్నారనే చెబుతూ…కేసీఆర్…బండిని బూతులు తిట్టారు. అంటే బూతులతోనే మళ్ళీ నీతులు చెప్పడానికి చూశారు.

Read more RELATED
Recommended to you

Latest news