పవర్‌ లిఫ్టింగ్ క్రీడాకారిణి షేక్‌ సాదియా రూ. 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించిన జగన్‌

-

అమరావతి : అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ ను ఏషియన్‌ పవర్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌ విన్నర్‌ షేక్‌ సాదియా అల్మస్‌ కలిసారు. షేక్‌ సాదియా అల్మస్‌ గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడాకారిణి.. ఎన్నో పతకాలు అందుకుంది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో 2021 డిసెంబర్‌లో జరిగిన ఏషియన్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో 3 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం సాధించింది షేక్‌ సాదియా.

ఈ నేపథ్యంలోనే షేక్‌ సాదియాకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి. అంతే కాదు మంగళగిరిలో పవర్‌ లిఫ్టింగ్‌ అకాడమీ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది జగన్ సర్కార్. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరుపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, షేక్‌ సాదియా తండ్రి సంధాని, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news