సీఎం జగన్‌ వల్ల నాకు ప్రాణహాని ఉంది.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..

-

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నుంచి త‌న‌కు ప్రాణ హాని ఉంద‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న త‌న‌కు పొంచి ఉన్న ముప్పును వివ‌రిస్తూ త‌న స‌హ‌చ‌ర పార్ల‌మెంటు స‌భ్యుల‌కు లేఖ రాశారు ర‌ఘురామ‌కృష్ణరాజు. 4 పేజీల‌ లేఖ‌లో వైసీపీ నేత‌ల‌పైనా, ప్ర‌త్యేకించి సీఎం జ‌గ‌న్‌పై ఆయ‌న ఆరోప‌ణ‌లు గుప్పించారు ర‌ఘురామ‌కృష్ణరాజు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పైనే న‌ర‌సాపురం లోక్ స‌భ స్థానం నుంచి ర‌ఘురామ‌రాజు ఎంపీగా గెలిచిన సంగ‌తి తెలిసిందే.

YSR Congress MP Raghu Rama Krishna Raju invites central ministers, MPs over  dinner in Delhi

జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల‌ను విమ‌ర్శించిన నేప‌థ్యంలో పార్టీతో ఆయ‌న‌కు దూరం పెరిగింది. ఈ క్ర‌మంలో ఓ ద‌ఫా ఏపీ సీఐడీ అధికారులు త‌న‌ను అరెస్ట్ చేయ‌గా…క‌స్ట‌డీలోనే పోలీసులు త‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని ఆరోపించారు ర‌ఘురామ‌కృష్ణ. ఈ వ్య‌వహారంపైనా ఆయ‌న స‌హ‌చ‌ర ఎంపీల‌కు లేఖ‌లు రాసిన సంగ‌తి తెలిసిందే తాజాగా జ‌గ‌న్ నుంచి త‌న ప్రాణాల‌కు ముప్పు ఉందంటూ మ‌రోమారు ఎంపీల‌కు ర‌ఘురామ‌రాజు లేఖ రాయ‌డం చర్చనీయాంశంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news