తెలంగాణలోకి అడుగుపెట్టిన రాహుల్ జోడో యాత్ర.. ఘన స్వాగతం పలికిన శ్రేణులు

-

తెలంగాణ రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎంట్రీ ఇచ్చింది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణా మండలం గూడబల్లూరు దగ్గర తెలంగాణలోకి ప్రవేశించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు శ్రీధర్ బాబు సహా పలువురు టీ కాంగ్రెస్ నేతలు. టైరోడ్ వరకు 3 కిలోమీటర్ల పాటు పాదయాత్ర కొనసాగనుంది. మహబూబ్ నగర్-రాయచూర్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇక కృష్ణా నది‌బ్రిడ్జి ‌నుండి తెలంగాణలో మూడు కిలోమీటర్ల మేర సాగనుంది రాహుల్ యాత్ర. ఇక ఇవాళ మరిక్కల్ వద్ద ప్రసంగించాక ఢిల్లీ కి రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. మక్తల్ నుండి హైదరాబాద్ కి హెలికాప్టర్ లో ప్రయాణం చేసి.. అక్కడ నుండి‌ ఢిల్లీకి రాహుల్ పయనం కానున్నారు. దీపావళి పండుగ కోసం మూడు రోజులు జోడో యాత్రకు బ్రేక్ ఇచ్చారు రాహుల్‌. ఈ నెల 27 ఉదయం 6 గంటల నుండి మళ్లీ మక్తల్ నుండి జోడో యాత్ర ఆరంభం కానుంది. నవంబర్ 8 వరకు తెలంగాణలో జోడో యాత్ర కొనసాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news