ప్రతీ మూడు నెలలకు ఓ సారి తెలంగాణలో రాహుల్ పర్యటన ?

-

ప్రతీ మూడు నెలలకు ఓ సారి తెలంగాణ కు రాహుల్ గాంధీ రానున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ లో కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం. సభ స్థలాన్ని పరిశీలించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి… అనంతరం మాట్లాడారు. ఆనాడు రజాకార్లు, ఇప్పుడు కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారు… తెలంగాణ ప్రజల రక్తంలో పోరాడే గుణం ఉందన్నారు రేవంత్ రెడ్డి.

rahul gandhi

భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడింది వరంగల్ గడ్డ అని.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసం సభ నిర్వహించట్లేదని వెల్లడించారు. రాహుల్ గాంధీ సూచన మేరకు వరంగల్ గడ్డపై సభ నిర్వహిస్తున్నామని.. విప్లవాలకు పునాది వేసింది ఓరుగల్లు అన్నారు రేవంత్. రుణమాఫీ కోసం 15వేల కోట్లు కేటాయించలేదు… బ్యాంకు రుణాల మిత్తి పెరిగి, మనస్తాపంతో రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని వెల్లడించారు. వరంగల్ లో 22 మంది మిర్చి రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్పందించలేదు.. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడంవల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. బెల్ట్ షాపులు తెచ్చి తాగుబోతుల తెలంగాణ చేస్తున్నాడన్నారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news