విరాళాల్లో బీజేపీ రికార్డ్… దేశంలోనే ఎక్కవ డొనేషన్లు అందుకున్న పార్టీగా గుర్తింపు

-

దేశంలో ప్రస్తుతం బీజేపీ పార్టీకి ఎదురు లేదు. కేంద్రంలో పాటు మెజారిటీ రాష్ట్రాల్లో కూడా బీజేపీనే అధికారంలో ఉంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో మళ్లీ అధికారం చేపట్టింది. అత్యంత కీలకమైన యూపీలో మరోసారి బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే దేశంలో అత్యధిక డొనేషన్లు అందుకుంటున్న పార్టీగా బీజేపీ రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది పార్టీలకు అంది. విరాళాల విషయంలో బీజేపీ పార్టీ రికార్డ్ క్రియేట్ చేసింది.

BJP
BJP

దేశ వ్యాప్తంగా ప్రధానంగా 12 పార్టీలకు రూ. 258 కోట్ల విరాళాలు అందగా… ఒక్క బీజేపీకే రూ. 212 కోట్లు విరాళాలు వచ్చాయి. ఇది మొత్తం విరాళాల్లో 82 శాతం. బీజేపీ తరువాతి స్థానంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ పార్టీ జేడీయూ రెండో స్థానంలో నిలిచింది. జేడీయూకు రూ. 27 కోట్ల విరాళాలు అందాయి. ఇది మొత్తం విరాళాల్లో 10.45 శాతం. కాంగ్రెస్, ఎన్సీపీ, ఏఐడీఎంకే, డీఎంకే, ఆర్జేడీ, ఆప్, ఎల్జేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలకు అన్నింటికి కలిపి కేవలం రూ. 19 కోట్లు విరాళాలు మాత్రమే అందాయి.

Read more RELATED
Recommended to you

Latest news