సీఎం కేసీఆర్ కు రాజకీయ బిక్ష పెట్టిందే కాంగ్రెస్ – రేవంత్‌ రెడ్డి

-

టీఆర్‌ఎస్‌ పార్టీపై మరోసారి రేవంత్‌ రెడ్డి విరుచుకుపడ్డారు. సింగిల్ విండో చైర్మన్ గా ఓడిపోయినా… కెసిఆర్ కి రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ అని స్పష్టం చేశారు రేవంత్‌ రెడ్డి. కెసిఆర్.. మొదట ఎమ్మెల్యే గా ఓడిపోలేదా..? కెసిఆర్ రాజకీయ ప్రస్థానమే ఓటమితో మొదలైందని గుర్తు చేశారు రేవంత్‌ రెడ్డి.

సిద్దిపేట ఎమ్మెల్యే నుండి..కరీంనగర్ ఎంపిగా పోయాడు.. అటు నుండి పాలమూరు పారిపోయి రాలేదా..కెసిఆర్.? అని నిలదీశారు. మెదక్ నుండి గజ్వేల్ పారిపోలేదా అని కెసిఆర్ పై ఫైర్‌ అయ్యారు. పారిపోవడంలో పట్టా ఇవ్వాల్సి వస్తె కెసిఆర్ కె ఇవ్వాలని చురకలు అంటించారు రేవంత్‌ రెడ్డి. కేటీఆర్ మాటలు గురివింద సామెత లెక్క ఉన్నాయని.. గాంధీ కుటుంబం తో పోల్చుకునే ప్రయత్నం trs వాళ్ళు చేస్తారని విమర్శించారు. దేశ స్వాతంత్య్రం కోసం జైలుకు వెళ్ళిన కుటుంబం గాంధీ కుటుంబం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news