రేవంత్ రెడ్డి రాజకీయ వ్యభిచారిలా మాట్లాడుతున్నాడు – గాధరి కిషోర్

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు చేసేది పాదయాత్రలు కాదు..పాడేలు కట్టే యాత్రలన్నారు. ఆర్టీఏ చట్టం పెట్టిందే రేవంత్ రెడ్డి కోసం అన్నట్లు వాడుకున్నారని అన్నారు. 119 మంది నియోజకవర్గాల్లో అందరూ దొంగలే అన్నట్లు రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గాదరి కిషోర్.

ఎన్నికల అఫిడవిట్ లో రేవంత్ రెడ్డి బ్లాక్ మేలర్ అని పెట్టుకుంటే బెటర్ అని ఎద్దేవా చేశారు. రాజకీయ వ్యభిచారి లెక్క రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. అమరుల స్థూపం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడితే అమరుల ఆత్మ ఘోషిస్తుందన్నారు. నిర్మాణాల అంచనాలు, బడ్జెట్ ఎందుకు పెరిగిందో ఆర్టీఏ వేసుకోని తెలుసుకోవాలని.. అది రేవంత్ రెడ్డికి తెలిసిన విద్యే కదా అంటూ ఎద్దేవా చేశారు.

అమరుల త్యాగాల పుణ్యంతో తెలంగాణ వచ్చిందని తెలువడానికి సెక్రటేరియట్ ముందు అమరుల స్థూపం.. సెక్రటేరియట్ వచ్చినప్పుడల్లా అది గుర్తుకు రావాలనే దాని ఉద్దేశం అన్నారు. అమరుల స్థూపం వద్ద రాహుల్ గాంధీతో దండం పెట్టించారా రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు గాదరి కిషోర్. ఇదిలా కొనసాగితే ప్రజాక్షేత్రంలో బట్టలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version