ఒకే వేదికపైకి చిరంజీవి, బాలకృష్ణ..?

-

టాలీవుడ్ అగ్రహీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకే వేదికపై కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే ఇరువురి ఫ్యాన్స్ కు ఇక పండగే. ఇలా ఒకే వేదికపై ఇద్దరు స్టార్లను చూసేందుకు అభిమానులు కూడా ఆసక్తికనబరుస్తున్నారు. తాజాగా అభిమానులు కోరిక తీరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

‘ట్రిపుల్ ఆర్’ మూవీని గ్రాండ్ గా ప్రమోట్ చేసేందుకు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణను ముఖ్య అతిథులుగా ఆహ్వనించనున్నట్లు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ లో మెగాహీరో రామ్ చరన్, నందమూరి నట వారసులు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండటంతో చిరంజీవి, బాలకృష్ణను ఆహ్వనించాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. అయితే దీనిపై చిత్రయూనిట్ అధికార ప్రకటన చేయాల్సి ఉంది. త్వరలో రిలీజ్ అయ్యేందుకు ట్రిపుల్ ఆర్ సిద్ధంగా ఉంది.  ప్యాన్ ఇండియా లెవల్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news