సౌందర్య ఆ స్థితిలో చూసి జీవితం అంటే ఇదే కదా అనిపించింది.. హీరోయిన్ ప్రేమ

-

టాలీవుడ్ నటి ప్రేమ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పని ఆసక్తికర విషయాలు చెప్పకు వచ్చారు ఈ క్రమంలో సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఈమె సౌందర్యం మరణం అత్యంత విషాదకరమని అన్నారు.

తన అందం అభినయంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న సౌందర్యరాశి సౌందర్య అలనాటి సావిత్రి అనంతరం మళ్లీ తెలుగు తెరకు దొరికిన సావిత్రమ్మ అంటూ అభిమానుల ఆదరణ పొందిన సౌందర్యం నిండు చీరలోనే కనిపిస్తూ అందరి మనసులు గెలుచుకున్నారు దాదాపు తన కెరీర్లో అందరూ స్టార్ హీరోలతో నటించిన సౌందర్య 24 ఏప్రిల్ లో ఒక రాజకీయ పార్టీ ప్రచారం గురించి వెళ్తూ హెలికాఫ్టర్ లో మరణించిన సంగతి తెలిసిందే ఆ సమయంలో ఆమెతోపాటు ఆమె సోదరుడు కూడా మరణించడం మరింత విషాదకరం అయితే తాజాగా ఈ విషయాలపై మాట్లాడిన ప్రేమ ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు

సౌందర్య మరణం పై మాట్లాడుతూ ప్రేమ.. “సౌందర్య చనిపోయిన రోజు.. ఆమెను చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటి ఎదురుగా ఇద్దరు ఫోటోలు పెట్టి ఉన్నాయి. సౌందర్య, ఆమె అన్నయ్యది. తన ఇంటికి వెళ్లినప్పుడు పార్థీవ దేహాన్ని ఒక బాక్స్ లో పెట్టారు. ఫేస్ లేదు. మొండెం మాత్రమే ఉంది. తట్టుకోలేకపోయా.. ఇంతేనా జీవితం అనిపించింది. సౌందర్య అమ్మగారిని చూసి చలించిపోయాను. ఒక ఆర్టిస్ట్ జీవితం ఇంతేనా.. ఏం తీసుకెళుతున్నాం. చనిపోయినప్పుడు మనకున్న పొజిషన్ ను, స్టార్ లైఫ్ ను ఏది తీసుకెళ్లం.. కేవలం గౌరవం, కర్మను మాత్రం మోసుకెళతాం. అక్కడ ఉన్నప్పుడు నాతో చాలామంది చెప్పారు. ముఖం గుర్తుపట్టడానికి తల కూడా లేదు.. ఆమె చేతికి ఉన్న వాచ్ చూసి గుర్తుపట్టామని.. ఆ సమయంలో ఆమె అమ్మగారితో మాట్లాడే దైర్యం చేయలేకపోయాను. బయటకి వచ్చేటప్పుడు సౌందర్య ఫోటో చూసి.. ఇంత అందమైన అమ్మాయి చనిపోయిందా..? అని నమ్మలేకపోయాను. ఆ ఫేస్ ఇప్పటికి నాకు గుర్తుంది. నేను సౌందర్య.. మంచి సినిమాలు చేశాం. ఇద్దరం కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడుకొనేవాళ్లం. కనీసం 10 నిముషాలు అయినా స్పెండ్ చేసేదాన్ని.. పంచవీటి గెస్ట్ హౌస్ లోనే సౌందర్య ఎప్పుడు ఉండేది. అక్కడికే వెళ్లి నేను కలిసేదాన్ని” అంటూ ప్రేమ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version