రైతులు చనిపోతున్నా..కేసీఆర్‌ కు సోయి లేదు :షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర రైతులు చనిపోతున్నా.. సీఎం కేసీఆర్‌ కు సోయి లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల. ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయిందని… చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయిందని నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల. పెట్టుబడి రాక రైతులు చస్తా ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారని.. ఇప్పుడు ఎరువుల ధరలు పెరిగాయి అని రైతుల మీద ప్రేమ పొంగుకొచ్చినందుకు చాలా సంతోషం దొరగారు అంటూ ఎద్దేవా చేశారు.

Sharmila comments on cm kcr
Sharmila comments on cm kcr

కానీ కేంద్రం మెడలు వంచుతామంటే.. నమ్మాలా? మొన్నటివరకు మీ మెడ మీద కత్తి పెట్టి వడ్లు కొనబోమని రాయించుకొన్నారు అన్న వాళ్ళ మెడలు ఈ రోజు మీరు వంచుతారా ? ఎందుకు మీ రాజకీయ డ్రామాలు? అని ఫైర్‌ అయ్యారు. మీ అధికారం కోసం, మీ కుర్చీ కోసం మీరు ఆడుతున్న నాటకాలలో ఇదే ఒక భాగమే తప్ప మీకు రైతుల మీద ప్రేమ లేదని… రైతుల చావుల మీద సోయి లేదని ఓ రేంజ్‌ లో నిప్పులు చెరిగారు వైఎస్‌ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news