Big News: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. బండి సంజయ్‌ అనుచరుడికి సిట్‌ నోటీసులు

-

మొయినాబాద్‌ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఇటీవల నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలతో కొనుగోలు చేసేందుకు యత్నించిన రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ అనే వ్యక్తులను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో, బుసారపు శ్రీనివాస్ అనే వ్యక్తికి సిట్ నోటీసులు జారీ చేసింది.

No evidence of BJP's involvement in MLA poaching case: Bandi Sanjay

ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ శ్రీనివాస్ ను ఆదేశించింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతికి ఫ్లయిట్ టికెట్లు కొనుగోలు చేసినట్టు శ్రీనివాస్ పై ఆరోపణల నేపథ్యంలో, అతడికి సిట్ అధికారులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. బుసారపు శ్రీనివాస్ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అనుచరుడిగా భావిస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news