జనసేన – బిజెపి కలిసే ఉన్నాయి – సోము వీర్రాజు

-

జనసేనతో బిజెపి కలిసే ఉందని మరోసారి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు. శుక్రవారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రంలో సైలెంట్ దోపిడి జరుగుతుందన్నారు. టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని నిర్మాణానికి పదివేల కోట్లు మంజూరు చేసినా.. చంద్రబాబు అమరావతిని కట్టలేకపోయాడని విమర్శించారు. మరోవైపు బిజెపికి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ అంశంపై సోము వీర్రాజు స్పందించారు.

పార్టీని వీడిన వాళ్లంతా సొంత అజెండాతోనే బయటకు వెళ్లారని అన్నారు. వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు సోమ వీర్రాజు. పార్టీలో ఏదైనా అసంతృప్తి ఉన్నప్పుడు పెద్దలతో మాట్లాడాలని.. అలా చేయకుండా పార్టీ మారుతారా? అని ప్రశ్నించారు. పార్టీ మారడానికి ఒక అజెండా ఉంటుందని చెప్పారు. 42 సంవత్సరాల నుంచి తాను బిజెపిలో ఉన్నానని.. పార్టీ నుంచి వెళ్లిపోయే వాళ్ల గురించి తానేం మాట్లాడతానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version