T20 World Cup 2024: టీమిండియాను గెలిపించిన హార్దిక్ పాండ్యా!

-

 

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 50 పరుగులు తేడాతో చిత్తు చేసింది. దీంతో టీం ఇండియా సెమీస్ కు చేరువగా వెళ్ళింది. 197 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లా ఓవర్లన్నీ ఆడి 146/8కే పరిమితమైంది. ఆ జట్టులో నజ్ముల్ హుస్సేన్ శాంటో (40) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా 2, అర్ష్ దీప్ 2 వికెట్లతో చెలరేగారు. పాండ్యా ఈ మ్యాచ్‌ లో అదిరిపోయే బ్యాటింగ్‌ తో అలరించాడు. ఇందులో 50 పరుగులు చేశారు పాండ్యా.

India won by 50 runs

కాగా, ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 24 మ్యాచ్ లకు సారథ్యం వహించారు. అందులో 19 గెలుపు, 4 ఓటములు, ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. విన్నింగ్ పర్సంటేజీ ఏకంగా 86.36 శాతంగా ఉంది. ప్రపంచ క్రికెట్లో మరే కెప్టెన్ కు ఇంత విన్నింగ్ పర్సంటేజీ లేదు. కాగా టీం ఇండియా కెప్టెన్ గా హిట్ మ్యాన్ అసాధారణ విజయాలు అందిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version