కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాయి : శ్రీధర్‌బాబు

-

జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి నది తీరంలో గల బ్రాహ్మణ సంఘ భవనంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో విఫలం అయ్యారు అని విమర్శించారు. లక్ష రూపాయల లోన్ మాఫీ అనేది ఒక మోసమని మిత్తి కూడా మాఫీ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.

రాబోయే ఎన్నికల్లో తమను గెలిపించాలని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ బంధు, దళిత బంధు గృహలక్ష్మి లాంటి పథకాలను ప్రజల ముందుంచగా, విశ్వకర్మల పథకం పేరుతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరోసారి మధ్య తరగతి ప్రజల ఆశలను ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టిందన్నారు. వారు ప్రవేశ పెడుతున్న జనాకర్షక పథకాలకు ప్రజలు మరోసారి మోసపోయి ఐదేళ్ల పాటు గోస పడొద్దని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల ఊబిలోకి నెట్టేశాయని ఆరోపించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version