“పుంగనూరు వీరప్పన్‌” పేరుతో పెద్దిరెడ్డి అవినీతిని బయటపెట్టిన టీడీపీ !

-

“పుంగనూరు వీరప్పన్‌” పేరుతో పెద్దిరెడ్డి అవినీతిని బయటపెట్టారు టీడీపీ నేత బోండా ఉమ. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ… పుష్ప లో లాగా… పెద్దిరెడ్డి రూ. 6889 కోట్లు దోచేసి..అడవులను మాయం చేశాడని… పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా మారి.. అరాచకాలు.. అవినీతి చేశారన్నారు. జే గ్యాంగులో పెద్దిరెడ్డి ప్రధాన భాగస్వామని.. జగన్ లావాదేవీలను దగ్గరుండి చూసే కీలక వ్యక్తి పెద్దిరెడ్డి అని ఆరోపణలు చేశారు.

శివశక్తి డెయిరీ ద్వారా పాడి రైతుల పొట్ట కొట్టి పెద్దిరెడ్డి రూ. 700 కోట్లు దోచారని.. పెద్ది రెడ్డికి చెందిన పల్ప్ కంపెనీ ద్వారా మామిడి రైతుల నుంచి రూ. 190 కోట్లు దోపిడీ చేశారని ఓ రేంజ్‌ లోఫైర్‌ అయ్యారు. పెద్దిరెడ్డి మద్యం, మైనింగ్, ఇసుక మాఫియాగా ఏర్పడి భారీ దొపిడీకి తెర లేపారని.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ భూ దొపిడీకి కేంద్రం పెద్దిరెడ్డేనని పేర్కొన్నారు. వేల ఎకరాలను మాఫియా ద్వారా చేజిక్కించుకుని రూ. 2 వేల కోట్లకు పైగా అక్రమార్జన చేసిన ఘనత పెద్దిరెడ్డిదేనని.. ఒక్క ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారానే పెద్దిరెడ్డి రూ. 1800 కోట్లు వెనకేశారని ఆగ్రహించారు.

అనకొండ పెద్దిరెడ్డి వల్ల శేషాచలం అడవి మాయం అయిందని.. పుష్ప సినిమా స్టైల్లో ఎర్రచందనం చెట్లను నరికించి దొపిడీ చేశారని నిప్పులు చెరిగారు. అక్రమార్జన ద్వారా ఓట్లను కొనుగోలు చేయాలనేది సీఎం జగన్ వ్యూహమని… వైసీపీలో అవినీతి అనకొండలు ఎక్కువయ్యారన్నారు. మంత్రుల అవినీతిపై సీఎం జగన్ విచారణ వేయాలని డిమాండ్‌ చేశారు. జగన్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ చేల్తే రాజీనామాలు చేసిన మంత్రులంతా జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news