కొడాలి నాని.. కార్యకర్తలతో కలిసి హరికృష్ణను ఓడించారు : రావి వెంకటేశ్వరరావు

-

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు. కృష్ణా జిల్లా గుడివాడలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ నేత కొడాలి నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నానిపై నమ్మకంతో నందమూరి హరికృష్ణ గుడివాడలో గంట గుర్తుపై పోటీ చేస్తే కొడాలి నాని చిత్తుగా ఓడించారని ఆరోపించారు రావి వెంకటేశ్వరరావు. గుడివాడలో హరికృష్ణను ఓడించింది నాని కాదా? అని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో హరికృష్ణ పోటీ చేయడాన్ని నాని జీర్ణించుకోలేకపోయారని, కార్యకర్తలతో కలిసి హరికృష్ణను ఓడించారని రావి వెంకటేశ్వరరావు అన్నారు.

టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు | TV9  Telugu

అలాంటి వెన్నుపోటు మనస్తత్వం ఉన్న నాని ఇప్పుడు నీతి వాక్యాలు వల్లిస్తుండడం సిగ్గు చేటని వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు రావి వెంకటేశ్వరరావు. కోవర్టు రాజకీయాలు చేసే ఆయనకు గుడివాడ ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. చేసిన తప్పులన్నింటికీ సమాధానాలు చెప్పాల్సిన రోజు వస్తుందని, జైలుకెళ్లక తప్పదని వెంకటేశ్వరరావు హెచ్చరించారు రావి వెంకటేశ్వరరావు.

Read more RELATED
Recommended to you

Latest news