కొడాలి నాని కి షాక్… నేడు గవర్నర్ ను కలవనున్న టిడిపి నేతలు

-

గత వారం రోజుల నుంచి గుడివాడ క్యాసినో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కొడాలి నాని తన ఫంక్షన్ హాల్ లో కేసు నిర్వహించాలని టిడిపి నేతలు ఆరోపిస్తుంటే… తాను ఎలాంటి తప్పు చేయలేదని మంత్రి కొడాలి నాని చెబుతున్నారు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.

ఈ నేపథ్యంలోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలు, నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఏపీ గవర్నర్ ను కలవనున్నారు. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గవర్నర్ బిశ్వభూషణ్ ను కలవనున్న టిడిపి నాయకులు. గుడివాడలోని క్యాసినో ఘటనపై ఈ సందర్భంగా టిడిపి నేతలు ఫిర్యాదు చేయనున్నారు. క్యాసినో పై కరపత్రాలు లాగే ఆధారాలను టిడిపి కమిటీ గవర్నర్ కు సమర్పించ నున్నది. కొడాలి నాని ని మంత్రివర్గం నుంచి తొలగించాలని కూడా గవర్నర్ బిశ్వభూషణ్ కోరనున్నారు టిడిపి పార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news