అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా

-

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం బుధవారం (నేడు) రాత్రి 12 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకొని.. పలువురు సినీ ప్రముఖులతో భేటీ అనంతరం.. గురువారం ఖమ్మం జిల్లాలో బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా పర్యటన వాయిదా పడింది. బిపర్ జాయ్ తుఫాన్ ఎఫెక్ట్ నేపథ్యంలో అమిత్ షా తన పర్యటనలు వాయిదా వేసుకున్నారు.

ఈ మేరకు రాష్ట్ర బిజెపి నేతలకు అమిత్ షా సమాచారం అందించగా.. ఖమ్మంలో రేపు జరగవలసిన సభ ఏర్పాట్లను బిజెపి శ్రేణులు నిలిపివేశాయి. త్వరలోనే అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి ఖరారు కానుంది. ఇక బిఫర్ జాయ్ తుఫాన్ ప్రధానంగా గుజరాత్ పైనే ప్రభావం చూపనుంది. దీంతో అమిత్ షా మరింత ఎక్కువగా ఆ రాష్ట్రంలో పరిస్థితులపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version