నేటి నుంచి హైదరాబాద్‌లో జీ20 వ్యవసాయ మంత్రుల సదస్సు

-

హైదరాబాద్​లో నేటి నుంచి జీ20 దేశాల వ్యవసాయ మంత్రుల సదస్సు జరగనుంది. కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు నుంచి మూడ్రోజుల వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. హెచ్‌ఐసీసీలలో నేడు ప్రారంభమయ్యే సదస్సు 17 వరకు కొనసాగనుంది. సభ్య దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సహకారాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతోంది.

ఈ సదస్సులో జీ20 సభ్యదేశాలైన ఇండోనేసియా, బ్రెజిల్‌, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, యూరోపియన్‌ యూనియన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, తుర్కియే తదితర ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు.

తొలిరోజైన ఇవాళ కేంద్ర వ్యవసాయశాఖ సహాయ మంత్రి కైలాస్‌ చౌధురి వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో భారత్‌ సాధించిన విజయాల ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం వ్యవసాయ వాణిజ్యం ప్రాధాన్యం, లాభార్జన, డిజిటల్‌ సాంకేతికతల వినియోగం తదితర అంశాలపై చర్చిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version