కాంగ్రెస్ వల్లే కేసీఆర్ కి సీఎం పదవి.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. బుధవారం జూలూరు పాడు మండలం వెంగన్న పాలెం గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమ్మెళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. కేసీఆర్ కపట నాటకాలను ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అరాచకాలను, సీఎం కల్లబొల్లి మాటలను ప్రజలకు వివరించాలన్నారు. 

బీఆర్ఎస్ ను భూ స్థాపితం చేసి.. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాకు రుణపడి ఉన్నామని.. కాంగ్రెస్ బిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల సీజన్ కావడంతో కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నారని పొంగులేటి ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ల పాలన కాలంలో ఏనాడు ఆర్టీసీని పట్టించుకోని సీఎం ఇప్పుడు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారని ఆరోపించారు. తనకు ఎలాంటి పదవీ లేకున్నా ప్రజలకు అండగా ఉంటానని స్పష్టం చేశారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version