డొక్కు స్కూటర్ పై తిరిగిన కేసీఆర్ లక్షల కోట్లు వెనకేశాడు – వైఎస్ షర్మిల

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. ఒకప్పుడు డొక్కు స్కూటర్ లో తిరిగిన కేసీఆర్ ఇప్పుడు లక్షల కోట్లు వెనకేశాడని ఆరోపించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాస్త కమిషన్ల చంద్రశేఖర రావు అయ్యాడని సెటైర్లు వేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష మహాధర్నాలో పాల్గొన్న షర్మిల మాట్లాడుతూ.. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ సాధించేంతవరకు వదిలిపెట్టద్దని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో రైతన్నల గోడు తెలుసుకొని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని.. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వీర్యం చేస్తూ ప్రజలకు సాగునీరు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. కేవలం కమిషన్ల కోసమే తెలంగాణ మొత్తాన్ని దోచుకున్నారని.. ఇప్పుడు దేశం మీద పడుతున్నారని ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. గత ఎన్నికల్లో ఓట్ల లబ్ధి కోసం లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ను నిర్మించి తీరుతామని హామీ గుప్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమయ్యాడని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news