బీఆర్ఎస్ ను వీడటం కొంచెం బాధగానే ఉంది : కడియం శ్రీహరి

-

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి, వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీటు దక్కించుకున్న కడియం కావ్య అనూహ్యంగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మొత్తం వరంగల్ వైపు తిరిగాయి. అయితే కడియం పార్టీ మార్పుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం మీడియా ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీని వీడటం కొంత బాధగానే ఉంది. కేసీఆర్ పట్ల నాకు గౌరవం ఉంది. అందుకే నేను ఆయనపై ఏ రకమైన’ విమర్శలు చేయదలచుకోలేదని అన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ. నాకు అవకాశాలు ఇచ్చింది. వాటిని నేను సరిగ్గా సద్వినియోగం చేసుకున్నాను అని కడియం శ్రీహరి చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కడియం కుమర్తె కడియం కావ్యకు సోమవారం కాంగ్రెస్ పార్టీ వరంగల్ ఎంపీ టికెట్ కేటాయిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version