బ్రేకింగ్ : ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నల్లాల ఓదెలు

-

మంచిర్యాల జిల్లా లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మంచిర్యాల జడ్పి ఛైర్మన్ భాగ్య లక్ష్మి, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఢిల్లీ లో ప్రియాంక గాంధీ సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు,కుమారులు. ఈ నేపథ్యంలోనే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ప్రియాంక గాంధీ.

నల్లాల ఓదేలు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 2009లో అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 13వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా గెలుపొందాడు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం జరిగిన ఉద్యమంలో భాగంగా 2010 ఫిబ్రవరి 14న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఓదేలు 2010, జూలై 30న జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యాడు. 2014లలో జరిగిన తెలంగాణ తొలి శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున చెన్నూర్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జి.వినోద్ పై గెలుపొందాడు. అయితే… 2018 ముందస్తు ఎన్నికల్లో మాత్రం.. నల్లాల ఓదెలుకు కాకుండా.. బాల్క సుమన్‌ కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటున్నారు నల్లాల ఓదెలు.

Read more RELATED
Recommended to you

Latest news