అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెబుతున్నారు – వై.ఎస్ షర్మిల

-

జనగామ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రఘునాథపల్లి సబ్ స్టేషన్ ముందు వరంగల్ రహదారిపై బైఠాయించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రహదారిపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరెంటు కోతలు లేకుండా పాలన అని అసెంబ్లీ సాక్షిగా వచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్నాము కాబట్టి అధికారంలో ఉంటామని చెబుతున్నారని, దొంగ మాటలు చెప్తుంది కేసీఆర్ దొంగల ముఠా అని విమర్శించారు. కరెంట్ ఎప్పుడు వస్తదో రైతుకు కూడా తెలియడం లేదని అన్నారు షర్మిల. “అమెరికాలో అయినా కరెంటు కోతలు ఉంటాయట కానీ తెలంగాణలో మాత్రం ఉండవట.. 24 గంటలు క్షణం కూడా పోకుండా కరెంటు ఇస్తున్నారట” అంటూ ఎద్దేవా చేశారు. ఇందులో వాస్తవం ఉందో లేదో తెలంగాణ రైతంగానికి అంతా తెలుసు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news