హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు యువకులు !

-

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ లో ఓ కారు పడి ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ పార్క్ ముందు కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు.. నేరుగా ట్యాంక్ బండ్ లోకి దూసుకెళ్లింది. దీంతో హుస్సేన్ సాగర్ లో ఆ కారు పడిపోయింది.

అయితే ఈ సంఘటన లో కారులో ఉన్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు… సోమజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. ఖైరతాబాద్ కు చెందిన నితిన్, స్పత్రిక్ , కార్తీక్ గా పోలీసులు గుర్తించారు. నాలుగు రోజుల క్రితమే ఈ కారు తీసుకున్నారని…. ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్ లో టిఫిన్ చేయడానికి వెళుతున్న నేపథ్యం లోనే ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version