కిరాణా దుకాణాదారులకు షాకిచ్చిన కేంద్రం.. జీఎస్టీ తప్పనిసరి…

-

వస్తు సేవల పై ప్రతి ఒక్కరు పన్ను చెల్లెస్తున్నారు.. ఇప్పుడు ఆ సంఖ్యను పెంచాలని భారత ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తాజాగా ఒక రిపోర్ట్ పేర్కొంది. ప్రభుత్వం గతంలో పన్ను వ్యవస్థలో భాగం కాని చిన్న వ్యాపారాలు, కిరాణా దుకాణాలను ఇప్పుడు చేర్చాలనుకుంటోంది.. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా వరకు అనధికారికంగా నడుస్తోంది. దీనిని ప్రభుత్వం నియంత్రించలేకపోతుంది. ఇదే జరిగితే కిరాణా దుకాణదారులకు షాక్ తగిలినట్లు అవుతుందని చెప్పవచ్చు.

 

జీఎస్టీని 2017లో అమల్లోకి రాగా.. ఇందులో 40 లక్షల రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపారాలు అన్ని పన్ను విధానంలో నమోదు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా సెక్టోరల్ విధానాన్ని ఉపయోగించడం ద్వారా జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపారాల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం చూస్తోంది. మార్కెట్ పరిమాణంతో పోలిస్తే చాలా తక్కువ పన్ను చెల్లింపుదారులు ఉన్న నిర్దిష్ట రంగాలపై ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది.

తమ కస్టమర్ల ద్వారా పన్నులు చెల్లించే పరోక్ష పన్ను చెల్లింపు వ్యాపార సంస్థల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోంది. ఏ చొరబాటు లేకుండా పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకోవడానికి టెక్నాలజీని ఉపయోగించడమే గవర్నమెంట్ లక్ష్యం. జీఎస్టీ చెల్లించాల్సిన వ్యాపారాలను కనుగొనడానికి ప్రభుత్వం ప్రైవేట్ డేటాబేస్లు, ప్రభుత్వ ఏజెన్సీల డేటాను ఉపయోగిస్తుంది. జీఎస్టీ నెట్లోని వ్యాపారాల సంఖ్య 2017లో 60 లక్షల నుంచి జనవరి 2023 నాటికి 1.4 కోట్లకు పెరిగింది.. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.చిన్న దుకాణాల వంటి వినియోగదారులకు నేరుగా విక్రయించే వ్యాపారాలపై దృష్టి పెడతారని అర్థం.. ఇది చిరు వ్యాపారులకు భారీ షాక్ అనే చెప్పాలి..

Read more RELATED
Recommended to you

Latest news