ఈ సారి కాంగ్రెస్ పార్టీకి యువరాజు వయసు కన్నా తక్కువ సీట్లే : మోడీ

-

పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొ న్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.సందేశ్‌ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పార్టీ గుండాలు వారిని బెదిరిస్తున్నారని మోడీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ 53 ఏళ్ల వయసును ప్రస్తావిస్తూ.. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి యువరాజు వయసు కన్నా తక్కువ సీట్లే వస్తాయని ఎద్దేవ చేశారు.

వెస్ట్ బెంగాల్ లోని బరాక్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. టీఎంసీ పాలనలో రాష్ట్రంలోని హిందువులు ద్వితీయ శ్రేణి పౌరులుగా మారారని మండిపడ్డారు.మోడీ ఉన్నంత వరకు సీఏఏ చట్టాన్ని రద్దు చేయలేరని స్పష్టం చేశారు. సందేశ్‌ఖాలీలో మహిళలపై టీఎంసీ ఏం చేసిందో మనమందరం చూశాం, ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ పేరు చెప్పి టీఎంసీ గుండాలు ఇప్పడు మహిళల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు . టీఎంసీ పాలనలో బెంగాల్ అవినీతికి కేంద్రంగా మారిందని, బాంబుల తయారీ కుటీర పరిశ్రమగా మారిందని , ఓటు బ్యాంకు రాజకీయాల ముందు రాష్ట్ర పాలన యంత్రాంగం లొంగిపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version