BREAKING : రమ్య రఘుపతి-నరేష్ వ్యవహారంలో ట్విస్ట్..నరేష్ కు రఘువీరారెడ్డి బెదిరింపులు !

-

టాలీవుడ్‌ నటుడు నరేష్ వ్యవహారం లో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనకు రమ్య రఘుపతి , రోహిత్ శెట్టి తో ప్రాణ హాని ఉందని కోర్టును ఆశ్రయించాడు నరేష్. 2010 మార్చి 3 న బెంగుళూరు లో రమ్యతో వివాహం చేసుకున్న నరేష్‌…పెళ్లికి కట్నం కూడా తీసుకోలేదు. రమ్యకు 30 లక్షల బంగారం చేయించింది మా అమ్మ విజయ్ నిర్మల అంటూ నరేష్‌ తాజాగా తెరపైకి తీసుకొచ్చాడు. పెళ్లి అయిన కొన్ని నెలల నుండే నాకు వేదింపులు మొదలయ్యాయని.. తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతులు పెట్టిందని నరేష్‌ పేర్కొన్నాడు.

రమ్యకు నాకు 2012లో రణ్వీర్ జన్మించాడని.. నాకు తెలియకుండానే పలు బ్యాంకులు, తమ వ్యక్తుల దగ్గర రమ్య డబ్బు తీసుకుందని ఆరోపించారు. నా పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసిందని.. అప్పులు తీర్చుకునేందుకు 10 లక్షలు చెల్లించానని పేర్కొన్నాడు నరేష్‌. నా ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించింది…అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి నన్ను వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని..ఒప్పుకోకపోవడంతో నన్ను చంపేందుకు ప్రయత్నించిందని ఫైర్ అయ్యారు.

సుపరి గ్యాంగ్ ను మాట్లాడుకుని నన్ను చంపాలనుకుంది…2022 ఏప్రిల్ లో కొంతమంది అగంతకులు నా ఇంట్లో చొరబడ్డారని నరేష్‌ ఆరోపించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని..తనకు నేను డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసిందన్నాడు. కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి తో ఫోన్ చేపించి బెదిరించిందని..నన్ను చంపేస్తారని భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదని తెలిపారు. తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకుందని..నా ఫోన్ ను హ్యాక్ చేసి పర్సనల్ మెసేజ్లు చూసేదని మండిపడ్డారు. రమ్య వేధింపులు భరించలేకపోతున్నానను..నాకు కోర్టు ద్వారా విడాకులు ఇప్పించండని కోరారు నరేష్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version